Skip to main content

మౌనం ఒక మంత్రం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం
*మంత్రౌషథ   సమాగమాః *
దాన మానా వమానాశ్చ
నవ గోప్యాః  మనీషిభిః
                     
మనిషి అంటే సామాన్య మానవుడు. మనీషి అంటే ఉదాత్త మానవుడు. అలాంటి వారు 9 విషయాలలో గోప్యతను పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆవేమనగా 

1. మన ఆయుష్షు మనకు తెలియదు. ఒక వేళ సిద్ధులు, యోగుల వలన తెలిసినా ఆడంబరంగా చెప్పుకోకూడదు.

2. మన నగ నట్రా, పొలాలు, స్థలాలు, నిధి నిక్షేపాలు పరులకు చెప్పరాదు.  

3.ఇంటిగుట్టు గుట్టుగానే ఉంచాలి. రచ్చ చేయరాదు. 

4. తేలు, పాము, విశేష మంత్రాలతో రోగులకు సేవ చేయవచ్చు. కాని ఆ మంత్రం వెల్లడించరాదు.  

5. అలాగే దివ్యౌషథంతో రోగాలు నయం చేయవచ్చు కాని దాని మర్మం విప్పరాదు.  

6.కీలక వ్యక్తులతో చేసిన మంతనాలను, చర్చలను బట్టబయలు చేయరాదు. ప్రాణాలకే ముప్పు రావచ్చు.

7.మనం చేసిన దానం, ధర్మం, ఉపకృతి రెండో చేతికే తెలియకూడదంటారు.  దర్పంగా చెప్పుకోరాదు.  

8. మన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా జరిగిన గౌరవాన్ని, సన్మానాన్ని మనమే గొప్పగా చెప్పుకోకూడదు. పేలవంగా ఉంటుంది.  

9.మనకు ఇంటిలో గాని, ఆఫీస్ లోగాని, ఇతరత్రా గాని అవమానం ఎదురైతే సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలే కాని, పది మందిలో అల్లరి చేసుకోరాదు.  మనమే  పలచబడిపోతాము.

ప్రతివారి జీవితంలో తారసపడే యీ 9 అంశాలలో గోప్యతను పాటించాలని భావము. లేకుంటే  సమస్యలు, కష్ట నష్టాలు, చింతలు, వంతలు ఎదురవుతాయి.

Comments

Popular posts from this blog

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

తెలియక చేసిన తప్పులకు పరిహారమేమిటి?

సమాధానమ్: సాంసారిక జీవితంలో ఇలాంటి సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. చాలాచోట్ల తెప్పు తెలియక గతజలసేతుబంధనం లాగా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో మున్ముందుగా తన తప్పును పెద్దల దగ్గర ఒప్పేసుకోవాలి. ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని శపథం చేసుకోవాలి. ఆ తర్వాత చేసిన పాపానికి శాస్త్రీయమైన ప్రాయశ్చిత్తం ఏదో తెలుకునే ప్రయత్నం చేయాలి. అది చెప్పే వారు దొరకకపోయినా, చెప్పినా అది అసాధ్యంగా ఉన్నా, ఈ పాప ప్రాయశ్చిత్త నిమిత్తమని సంకల్పిస్తూ, యథాశక్తిగా భగవన్నామ స్మరణ చేతనైనంత దీర్ఘంగా చేయాలి. సర్వ ప్రాయశ్చిత్త విధులకూ ఇదే సారాంశం.