ఉపనిషత్తులు వేద భాగాలుగా సనాతనాలు. ఇందులో సత్యం భగవన్ముఖోదీరితం. ఈ సత్యం ప్రత్యక్షానుమానాది భౌతిక పరిచ్ఛిన్న ప్రమాణాల ద్వారా తెలుసుకొన్నది కాదు. మరి, ఋషులు సాక్షాత్తుగా దర్శించినది. మన ప్రత్యక్షానుభవంకంటే ఋషుల దర్శనానుభవం నిర్దుష్టం, ప్రామాణికం, వాస్తవం, దివ్యమూను. యాస్కుల వారు "సాక్షాత్కృత ధర్మాణః" అంటారు ఋషులని. వారి ప్రయత్నం లేకుండానే వారి ఎదలలో భాసించే దివ్య సత్యం ఇది. "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అంటారు శ్రీశంకరులు ఈ సత్యాన్ని.
భక్తి మార్గంలో తొలి అడుగులు వేయడానికి మా వెబ్సైట్ మీకు ఆదర్శ వేదిక.