సమాధానం:-
నిజమే, భాగవతంలో రాధ లేదు. శ్రీకృష్ణుని భార్యగా రుక్మిణీ దేవికే మనం పట్టంకడతాం. తమిళ సంప్రదాయంలో నీళాదేవి (నప్పిన్న) శ్రీకృష్ణుని పట్టపుదేవి. అయితే ఉత్తరాది అంతటా రాధకే హారతి పడతారు. రాధేశ్యాం అంటూనే ఒకరినొకరు పలకరించుకోవడం అక్కడి ప్రజలకు అలవాటు. రాథే రాథే అంటూ వారు తన్మయులై భజనలు చేస్తారు.
బ్రహ్మవైవర్త పురాణంలో రాధ ప్రస్తావన ఉంది. ద్వాపర యుగంలో రాక్షసరాజులు చాలామంది ప్రజలను పీడిస్తూ ఉంటే భూమాత భరించలేక బ్రహ్మతో మొరపెట్టుకుంది. అప్పుడు బ్రహ్మ భూదేవిని, మహేశ్వరుని, నారాయణుని వెంటపెట్టుకుని గోలోకం వెళతాడు. అక్కడ రాసమండలంలో రాధతో విహరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి, స్తుతిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడే అందరికీ చిరునవ్వుతో అభయమిచ్చి తాను ద్వాపరాంతంలో గోకులంలో అవతరిస్తానని, అలాగే దేవతలందరూ గోపాలురుగా, యాదవులుగా జన్మిస్తారని, వృషభానుని కుమార్తెగా రాధ, మహాలక్ష్మి భీష్మకుని పుత్రిక రుక్మిణిగా జన్మిస్తారని చెపుతాడు.
ఇదీ బ్రహ్మవైవర్త పురాణంలోని రాధాకృష్ణుల గాథ.
భాగవతంలో రాధ ఊసేలేదు.
నిజమే, భాగవతంలో రాధ లేదు. శ్రీకృష్ణుని భార్యగా రుక్మిణీ దేవికే మనం పట్టంకడతాం. తమిళ సంప్రదాయంలో నీళాదేవి (నప్పిన్న) శ్రీకృష్ణుని పట్టపుదేవి. అయితే ఉత్తరాది అంతటా రాధకే హారతి పడతారు. రాధేశ్యాం అంటూనే ఒకరినొకరు పలకరించుకోవడం అక్కడి ప్రజలకు అలవాటు. రాథే రాథే అంటూ వారు తన్మయులై భజనలు చేస్తారు.
బ్రహ్మవైవర్త పురాణంలో రాధ ప్రస్తావన ఉంది. ద్వాపర యుగంలో రాక్షసరాజులు చాలామంది ప్రజలను పీడిస్తూ ఉంటే భూమాత భరించలేక బ్రహ్మతో మొరపెట్టుకుంది. అప్పుడు బ్రహ్మ భూదేవిని, మహేశ్వరుని, నారాయణుని వెంటపెట్టుకుని గోలోకం వెళతాడు. అక్కడ రాసమండలంలో రాధతో విహరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి, స్తుతిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడే అందరికీ చిరునవ్వుతో అభయమిచ్చి తాను ద్వాపరాంతంలో గోకులంలో అవతరిస్తానని, అలాగే దేవతలందరూ గోపాలురుగా, యాదవులుగా జన్మిస్తారని, వృషభానుని కుమార్తెగా రాధ, మహాలక్ష్మి భీష్మకుని పుత్రిక రుక్మిణిగా జన్మిస్తారని చెపుతాడు.
ఇదీ బ్రహ్మవైవర్త పురాణంలోని రాధాకృష్ణుల గాథ.
భాగవతంలో రాధ ఊసేలేదు.
Comments
Post a Comment