సమాధానమ్:
మన వేదోక్త కుటుంబ వ్యవస్థ గురించి మన యువతీ యువకులకు సరియైన అవగాహన లేకపోవటం వల్లే ఇలాంటి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి.
మన వ్యవస్థలో భర్త ముందు జన్మిస్తాడు. తర్వాత భార్య జన్మిస్తుంది.
భర్త కుటుంబానికి నాయకుడు. భార్య ఆ కుటుంబానికి దీపం.
భర్త ఏ దైవకార్యం చేసినా ధర్మపత్నీ సమేతస్య మమ అని సంకల్పం చెప్పుకోవాలి.
భార్య సభర్తృకాయాః మమ అని చెప్పుకోవాలి. ఇది అవశ్యవిధి.
ఇలాంటి వ్యవస్థలో ఒకరి పుణ్యం ఎక్కువ అనీ, ఒకరిది తక్కువనీ అనుకోకూడదు.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
Comments
Post a Comment