సమాధానం: పచ్చని ఆకులు, వెన్న రెండూ దేహంలో ఏర్పడే తీవ్ర ఉష్ణాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
తపస్సు, ఆలోచనలు అధికంగా చేసే వారిలో తీవ్రమైన వేడిపుడుతుంది.
ఆంజనేయుడు ఎల్లప్పుడూ శ్రీరామనామాన్ని జపిస్తూ, వేరే తలపు లేకుండా తదేక ధ్యానంలో నిమగ్నం అయి ఉంటాడు గదా! అలాంటి వారిలో కలిగే వేడి వల్ల లోకాలన్నీ తపింపబడతాయట.
దేవతలు కూడా ఆ ఉష్ణ తీవ్రతను భరించలేరట.
చిరంజీవి అయిన హనుమకు శ్రీరామధ్యానం వల్ల పుట్టే వేడిని తగ్గించడానికి, శీతలోపచారంగా ముఖ్యంగా మంగళవారాలు తమలపాకులతో పూజ, వెన్న పూత సమర్పించడం ఆనవాయితీ అయింది.
జైశ్రీహనుమాన్
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి