సమాధానం: పచ్చని ఆకులు, వెన్న రెండూ దేహంలో ఏర్పడే తీవ్ర ఉష్ణాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
తపస్సు, ఆలోచనలు అధికంగా చేసే వారిలో తీవ్రమైన వేడిపుడుతుంది.
ఆంజనేయుడు ఎల్లప్పుడూ శ్రీరామనామాన్ని జపిస్తూ, వేరే తలపు లేకుండా తదేక ధ్యానంలో నిమగ్నం అయి ఉంటాడు గదా! అలాంటి వారిలో కలిగే వేడి వల్ల లోకాలన్నీ తపింపబడతాయట.
దేవతలు కూడా ఆ ఉష్ణ తీవ్రతను భరించలేరట.
చిరంజీవి అయిన హనుమకు శ్రీరామధ్యానం వల్ల పుట్టే వేడిని తగ్గించడానికి, శీతలోపచారంగా ముఖ్యంగా మంగళవారాలు తమలపాకులతో పూజ, వెన్న పూత సమర్పించడం ఆనవాయితీ అయింది.
జైశ్రీహనుమాన్
దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?
సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న
Comments
Post a Comment