సమాధానం:
ఈ ధర్మసందేహమే చతుర్ముఖ బ్రహ్మకూ వచ్చింది. ఆయన మహావిష్ణువును అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది. "నా ఎదుట ఉంచిన విశేష ప్రసాదములను నేను చూపులతో స్వీకరింతును" అని.
దర్శనాత్ గృహ్యతే మయా రసాన్ దాసస్య జిహ్వా యా మనశ్నామి కమలోద్భవ
"రుచిని మాత్రము నా భక్తుని నాలుక పై నుండి గ్రహింతును."
మనం శుచిగా, శుభ్రంగా, రుచిగా ఏమి దేవుడి ముందు నైవేద్యం పెట్టినా అది ప్రసాదం గా మనకు అందుతుంది. దానిని మొదట భక్తులకందించితే, వారు ప్రసాద ప్రతిపత్తితో కొద్దిగా చేతిలో ఉంచుకొని, స్వీకరించి "భగవంతుడు చాలా భోగ్యంగా ఆరగించారు" అంటే అప్పుడది భగవంతుడు స్వీకరించినట్లవుతుంది.
అలాగే మనం క్రొత్త వస్త్రాలు, పండ్లు, మొదలైనవి ఏం తీసుకున్నా ఒకసారి మన ఇంట్లో దేవుడి ముందుంచి "స్వామీ! ఇవన్నీ నీ దయవల్లనే మాకు లభించాయి" అని కృతజ్ఞతా పూర్వకంగా భగవంతుడికి నివేదించి స్వీకరించాలి.
ఇది మన భారతీయ సంప్రదాయం.
జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్
Comments
Post a Comment