సమాధానం: మన ఇతిహాస పురాణాల్లోంచి మనం నేర్చుకొని పాటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆంజనేయస్వామి సముద్రలంఘనం చేసి, నూరు యోజనాలు దాటి లంక చేరాడు. అలాగే మనం సంసార సాగరాన్ని నూరేళ్ళ ఆయుర్ధాయం లోపల దాటి ఆవలి తీరం చేరాలి. యోగి, సాధకుడు, ఆచార్యుడు అయిన హనుమ తనను తాను రామబాణంతో పోల్చుకున్నాడు. ఇదే కర్మయోగం యొక్క మూలసూత్రం. హనుమ ఈ పనిని తాను చేస్తున్నానని కానీ, ఇది తన కోసమే అని కానీ, ఇది తనది అని కానీ తలవడంలేదు. రామకార్యం కోసం రామబాణంలాగా వెళ్తానంటాడు. ఈ జీవన సూత్రాన్ని మనం పాటించాలి. అంతా నేను, నాది అనే భావం మనలో తగ్గాలి. సముద్రాన్ని దాటడంలో హనుమ నాలుగు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఏ ఆలంబనము లేకుండా అగాథమైన సాగరాన్ని దాటడం, మైనాకుడి అతిధ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ఆగకుండా ముందుకు సాగడం, సురస అనే రాక్షసిని ఉపాయంతో జయించడం, సింహిక అనే ఛాయా రాక్షసిని సంహరించడం ఈ పనుల్ని అవలీలగా చేసిన హనుమను దేవతలు ఇలా మెచ్చుకున్నారు.
యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర! యథాతవ
ధృతిర్దృష్టిర్కమతిర్ధాక్ష్యం స్వకర్మ సు నసీదతి
ఓ వానరేంద్రా! నీలా ఎవరికైతే ధైర్యం, పూనిక, గమ్యంపై దృష్టి, వివేకం, యుక్తి, సామర్థ్యం ఉంటాయో అతడు తన పనిలో విజయం సాధిస్తాడు. ఏ కార్యం సాధించాలన్నా మనకు ఉండాల్సిన గుణగణాలే ఇవి. మానవుని జీవితమే రామాయణం. జీవితంలో అడుగడుగునా మనకు పాఠాలు నేర్పే సద్గురువు వాల్మీకి మహర్షి.
శుభంభూయాత్
శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం. విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు. 2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు. 3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు. 4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. 5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు. 6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి