గాఢ నిద్రలో మనస్సు, బుద్ధి, చిత్తం ఆత్మ ఏ ఏ పనులు చేస్తుంటాయి? వాటిలో దేని మీద ఏది పట్టు కలిగి ఉంటుంది?
సమాధానం:
మనసుకు రూపాంతరాలే బుద్ధి, చిత్తం. ఇంద్రియాల ద్వారా మనసు గ్రహించే విషయాలను భద్రపరచే స్టోర్ రూమ్ చిత్తం. చిత్తం నుంచి ఒక్కో అంశంపై అనేక విషయాలను పరిశీలించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. గాఢ నిద్రనే సుషుప్తి అంటాం.
సుష్ఠు అపీతో భవతి=స్వపితి. అంటే పరమాత్మతో బాగుగా కలిసి ఉండడమే సుషుప్తి. గాఢనిద్రలో ఇంద్రియాలు బాహ్య విషయాలను గ్రహించడం విరమిస్తాయి. మనసు నిర్విషయం అవుతుంది. అప్పుడు ఆత్మ పరమాత్మతో బాగుగా చేరిపోయి ఒకటైనట్లుంటుంది. అదే సుషుప్తి. అయితే మనం నిత్యం అనుభవించే సుషుప్తిలో, అవిద్య మనల్ని వదలకపోవడంవల్ల పరమాత్మానుభవం తెలియకుండా పోతోంది. అన్నిటికంటే మన మీద అవిద్యకే పట్టు ఎక్కువ. అది తొలగించుకోవాలంటే భగవదనుగ్రహం ఉండాలి.
Comments
Post a Comment