సమాధానం: భగవత్ స్తోత్రం ఏదైనా భాషా దోషాలు లేకుండా మీకు వచ్చిన, నచ్చిన శైలిలో రాగయుక్తంగానో, ఉత్తవచనంలోనే ఏదో ఒక పద్ధతిలో మనస్సు లగ్నంచేసి చదువుకోవచ్చు.
అయితే పురుషసూక్తం వంటి వేదానికి చెందిన స్తోత్రాలను ఇప్పటికే వేద పండితులచే పఠింపబడుతున్న స్వరాలలోనే చదవాలి. వేదమంత్రాలు స్వరం మార్చి చదివితే అపార్థాలు, అనర్థాలు వచ్చే ప్రమాదం ఉన్నది.
గాయత్రీ మంత్రం కూడా అలాంటిదే. ఒక్కోదాన్ని బట్టి స్వరం మారుతూ ఉంటుంది.
స్తోత్రం ఎంత పెద్దదైనా ఉండవచ్చు, కాని మంత్రం సంపుటి అక్షరాలతో ఓంకారంతో చిన్నదిగానే ఉంటుంది.
ఉదా;- పంచాక్షరి, షడక్షరి, అష్టాక్షరి మొదలైనవి.
మంతారంత్రాయతే ఇతి మంత్రః మననం (జపం) చేస్తే రక్షించేదే మంత్రం. మనస్సుకు శాంతిని, దాంతిని, అనన్య భక్తిని, సత్ప్రవర్తనను కలిగించేదే స్తోత్రం.
స్తోత్రం గురూపదేశం లేకుండా చదువుకోవచ్చు. కాని మంత్రం గురూపదేశంపొంది, నియమనిష్ఠలతో జపిస్తేనే ఫలితానిస్తుంది.
Comments
Post a Comment