ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పంచమి తీర్థం ఎక్కడ ఉంది?

సమాధానం:

తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళుల కార్తీకమాసంలో పంచమీ తిథి నాదు పుష్కరిణిలో పద్మతీర్థంలో చక్రస్నానం జరుపుతారు. ఈ తీర్థం స్వయంగా శ్రీనివాసుడే ఏర్పాటు చేశాడని ప్రతీతి. తిరుచానూరులో పుష్కరిణికి పద్మపుష్కరిణి అనీ, పద్మతీర్థం అని పేరు. అమ్మవారు పంచమినాడు జన్మించారు.

తిరుమలలో ఆశ్వీయుజ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. చక్రాన్ని చక్రత్తాళ్వార్ అని వైష్ణవ సాంప్రదాయంలో  సంభావిస్తారు. తిరుమలలో వలె తిరుచానూరులోను కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు పద్మావతిదేవి ఉత్సవమూర్తితో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వైభవంగా తీసుకొస్తారు.

అదే సమయంలో తిరుమల నుండి శ్రీవేంకటేశ్వరుడు పద్మావతికి జన్మదిన కానుకగా రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికెలు, పసుపు, చందనం ముద్దలు, తులసిమాలలను సారెగా పంపుతారు. ఏనుగు అంబారీపై వాటిని తిరుమల నుండి ఊరేగింపుగా తెస్తారు. వాటిని ఆలయ కార్యనిర్వహణాధికారి సభక్తికంగా స్వీకరించి అమ్మవారికి సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో వేలాది భక్తులు చక్రంతోబాటు పుష్కరిణిలో స్నానం చేస్తారు.

ఆకాశంలో ఆ సమయంలో ఏటా గరుడపక్షి పుష్కరిణిపై ప్రదక్షిణ చేయడం కళ్ళారా వీక్షించవచ్చు.

శుభంభూయాత్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

వివాహ సమయంలో సప్తపది అంటారు. దీని పూర్వాపరాలు తెలియజేయండి

 "సఖ్యం సాప్తపదీనం" అనేది ఒక శాస్త్ర సూత్రం. అంటే ఏడడుగులు కలిసి ప్రయాణం చేస్తే వారిద్దరికీ స్నేహం కుదురుతుంది - అని భావం. ఈ సూత్రాన్ని తీసుకుని ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క సంకల్పాన్ని జోడించి, వధూవరులిద్దరి చేత సంయుక్తంగా ఏడడుగులు వేయించే వేదోక్త ప్రక్రియే సప్తపది.