సమాధానం:
ఈ భూమి పాలానా బాధ్యతను బ్రహ్మ సూర్యుని కుమారుడైన వైవస్వత మనువుకు అప్పగించాడు. ఆ వైవస్వత మనువే అయోధ్యా పట్టణాన్ని నిర్మించి, దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఆయన భార్య పేరు శ్రద్ధ. గురువు వశిష్టుడు.
పూర్వకాలం రాజులకు తమ ప్రాభవం చాడుకోవడానికి, లోక కల్యాణానికి యజ్ఞాలు, యాగాలు చెయ్యడం అలవాటు. అలాగే ఒక యజ్ఞం జరిపించమని వశిష్టుడిని అడిగాడు.
అపుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు "రాజా! నీవనుకున్న యజ్ఞం చేయించడం నాకనందమే, కాని ఇక్కడ ఒక నది కాని తీర్థం కాని లేవు కదా! నదిలేని చోట యజ్ఞం చెయ్యలేం కదా" అన్నాడు.
"ఏం చెయ్యమంటారు గురుదేవా?" అని రాజు అడిగాడు.
అపుడు వశిష్టుడు "నీవు నీ బాణాన్ని సంధించి మానస సరోవరం నుండి ఒక నదిని రప్పించు" అని అన్నాడు.
రాజు వెంటనే సంకల్పం చేసి ఒక బాణాన్ని సంధించి విడిచాడు. ఆ బాణం వేగంగా హిమాలయాల్లోని మానస సరోవరం వెళ్ళి అక్కడ నుండి ఒక మనోహరమైన నదికి మార్గాన్ని చూపుతూ, అయోధ్యా నగరానికి తీసుకువచ్చింది.
ఆ నది శరము (బాణం) చేత తీసుకుని రాబడింది గాబట్టి శరయూ అని, మానస సరోవరం నుండి తేబడినది కాబట్టి సరయు అని పిలువబడింది.
ఆ సరయూ తీర్థంతో వైవస్వత మనువు తాను తలపెట్టిన యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించాడు.
ఇపుడు మనం వైవస్వత మన్వంతరంలోనే ఉన్నాం.
శుభంభూయాత్
Comments
Post a Comment