కుశ మూలే స్థితో బ్రహ్మ,
కుశమధ్యే జనార్ధనః
కుశాగ్రే శంకరో దేవః
త్రయోదేవా కుశేస్థితాః
ధర్బల మొదలులో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, చివరి భాగంలో శివుడు ఆవాహనమై ఉంటారు. అందుకే దర్భ అనేది త్రిమూర్తుల స్వరూపం.
దర్భలను బ్రహ్మదేవుడు సృష్టించాడు. హిందూ ఆచార సంప్రదాయాలలో దర్భలను పవిత్రంగా వాడతారు. వీటిని కుశలు అని కూడా అంటారు.
గరుత్మంతుడు తన తల్లి దాసీతనాన్ని తొలగించటానికి దేవ లోకం నుంచి అమృతకలశం తెచ్చి దర్భల మీద పెట్టి కద్రువ పుత్రులకి చూపించి, తన తల్లిని దాసీతనం నుంచి విముక్తి చేయండి అని కోరతాడు. అలా అమృతభాండం స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందువల్లే సమస్త దేవ, పితృ కార్యాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యతను, అర్హతను పొందాయి.
కాలువల ఒడ్డున ఈ గడ్డి పెరుగుతుంది. పచ్చివిగా ఉన్నవాటికంటే ఎండిన దర్భలనే వాడతారు. ఆచార సంపన్నులు దర్భ ఆకారంలో ఉండే ఉంగరాన్ని దర్భాంగుళీయకాన్ని బంగారంతో తయారుచేసి పుణ్యకార్యాలలో వాడతారు. దర్భలు తీసుకొని సంకల్పించి మంత్రజలంతో వాటిని అస్త్రాలుగా మునులు ప్రయోగించారు.
శుభంభూయాత్
శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం. విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు. 2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు. 3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు. 4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. 5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు. 6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి