కుశ మూలే స్థితో బ్రహ్మ,
కుశమధ్యే జనార్ధనః
కుశాగ్రే శంకరో దేవః
త్రయోదేవా కుశేస్థితాః
ధర్బల మొదలులో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, చివరి భాగంలో శివుడు ఆవాహనమై ఉంటారు. అందుకే దర్భ అనేది త్రిమూర్తుల స్వరూపం.
దర్భలను బ్రహ్మదేవుడు సృష్టించాడు. హిందూ ఆచార సంప్రదాయాలలో దర్భలను పవిత్రంగా వాడతారు. వీటిని కుశలు అని కూడా అంటారు.
గరుత్మంతుడు తన తల్లి దాసీతనాన్ని తొలగించటానికి దేవ లోకం నుంచి అమృతకలశం తెచ్చి దర్భల మీద పెట్టి కద్రువ పుత్రులకి చూపించి, తన తల్లిని దాసీతనం నుంచి విముక్తి చేయండి అని కోరతాడు. అలా అమృతభాండం స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందువల్లే సమస్త దేవ, పితృ కార్యాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యతను, అర్హతను పొందాయి.
కాలువల ఒడ్డున ఈ గడ్డి పెరుగుతుంది. పచ్చివిగా ఉన్నవాటికంటే ఎండిన దర్భలనే వాడతారు. ఆచార సంపన్నులు దర్భ ఆకారంలో ఉండే ఉంగరాన్ని దర్భాంగుళీయకాన్ని బంగారంతో తయారుచేసి పుణ్యకార్యాలలో వాడతారు. దర్భలు తీసుకొని సంకల్పించి మంత్రజలంతో వాటిని అస్త్రాలుగా మునులు ప్రయోగించారు.
శుభంభూయాత్
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
Comments
Post a Comment