ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నాకు ఈ జన్మలోనే ఆత్మదర్శనం, దైవదర్శనం, మోక్షం సంపాదించాలని ఉంది. నేనేం చేయాలి?

సమాధానం: 

ప్రతి ఒక్కరూ కోరుకోదగినది, చేరుకోవలసినది ఇదే. ముందు సత్పురుష సాంగత్యం చేయండి. ఒక సత్సంగంలో చేరండి. శమదమాది గుణాలు అలవరచుకోండి. ఒక సద్గురువును ప్రసాదించమని మీ కులదైవాన్ని ప్రార్థించండి.

సద్గురువులంటే కేవలం దర్శనం మాత్రం ఇచ్చే దర్శన గురువులు కాదు. ఆర్భాటం ప్రదర్శించి డబ్బులు గుంజుకునే ప్రదర్శన గురువులు కాదు. ఏం చెయ్యాలో చెప్పకుండా మాయమాటలు చెప్పే మాయాగురువులు కాదు. ముందు తాము ఆచరించి, తర్వాత శిష్యులకు చెప్పి, చేయించే సదాచార్యులనే ఆశ్రయించండి. వారు తత్త్వదర్శనులు, మార్గదర్శకులు అయి ఉంటారు.

ఒకసారి దైవానుగ్రహంతో సదాచార్యులు లభించాక, ఇక మీ భారమంతా ఆయనపై ఉంచి, నడుచుకోవడమే మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాలను చేరుకునే ఏకైక మార్గం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

హిందూ దేవుళ్ళు: అనంతమైన భక్తికి, అపారమైన జ్ఞానానికి మూలాలు

హిందూ దేవుళ్ళు: అనంతమైన భక్తికి, అపారమైన జ్ఞానానికి మూలాలు DevotionalWaves కు స్వాగతం! మన సనాతన ధర్మం, హిందూ మతం ఎన్నో వేల సంవత్సరాలుగా మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని, జీవన విలువలను అందిస్తూ వస్తోంది. ఈ విశాలమైన ధర్మంలో, దేవతలు మరియు దేవతల ఆరాధన ఒక ముఖ్యమైన భాగం. హిందూ దేవుళ్ళు కేవలం విగ్రహాలు కాదు, వారు విశ్వశక్తికి, ప్రకృతి శక్తులకు, మానవ జీవితంలోని వివిధ కోణాలకు ప్రతీకలు. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, హిందూ దేవతల ప్రాముఖ్యతను, వారి వైవిధ్యాన్ని, మరియు వారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే. రాబోయే పోస్ట్‌లలో, మనం ప్రతి దేవుడు/దేవత గురించి లోతుగా, వారి కథలు, విశిష్టతలు, మరియు పూజా విధానాలపై ప్రత్యేకంగా చర్చిస్తాము. హిందూ దేవుళ్ళు ఎవరు? వారి ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మతంలో "దేవుడు" అనే భావన చాలా విస్తృతమైనది. ఇది ఏకేశ్వరవాదం (ఒకే దేవుడిని నమ్మడం) మరియు బహుదేవతారాధన (అనేక దేవతలను ఆరాధించడం) రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ వైవిధ్యం హిందూ ధర్మం యొక్క సౌలభ్యాన్ని, లోతైన తాత్వికతను ప్రతిబింబిస్తుంది.   బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (త్రిమూర్తులు)...