మనపై ప్రసరించి మనను ప్రభోదించి ప్రభావితం చేసే ఈశ్వరుని నిశ్వాసం వేదాలు.
"యస్య నిశ్వసితం వేదాః" ఊపిరి ఉనికికి ఉత్ప్రేక్షకం. ఆయన ఉనికిని నిరూపించటంతో పాటు జాతికి ప్రాణవాయువును ప్రసాదించి జన్మకు చారితార్థ్యాన్ని ప్రతిపాదించేది ఈ నిశ్వసనం.
ఊపిరి ఆగిపోతే ఉనికే సమసిపోతుంది. అందుకే భగవత్ సత్తను సందేహించే వారికంటే వేదాల ప్రామాణ్యాన్ని శంకించే వారినే మన వారు తీవ్రంగా పరిగణించేరు. వారినే నాస్తికులన్నారు, బాహ్యులన్నారు.
ఈ నిశ్వాసాన్ని ప్రకృష్టంగా సమాకర్షించుకొన్నవారు, సమార్జించుకొన్నవారు ఋషులు. వారి ఎదలలో సునిక్షిప్తమైన ఈ నిశ్వాసమే దివ్యజ్ఞానాన్ని కల్గించి, దివ్య దర్శనాన్ని ప్రసాదించింది.
అంచేతే వారి దర్శనం, వారి అనుభవం "పురుష ప్రయత్నం వినా ప్రకటీభూతం" అన్నారు మన పెద్దలు.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి