మన దృష్టిని పట్టుదలగా సరియైన ఆధ్యాత్మిక మార్గంపై నిలిపితే మనల్నెవరూ వెనుకకు మరల్చలేరు.
మన సమస్యలను హృదయంలో దుర్బలత్వం లేకుండా ఎదుర్కోవడం నేర్చుకుంటే, మనకు భగవంతుని నుండి అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది.
కార్య సాధనకు కావలసిన శక్తి, ఉత్సాహం వస్తాయి. ఎంతటి చేదు అనుభవం అయినా అది మనకు ఎంతో కొంత నేర్పుతుందనే విషయాన్ని సర్వదా జ్ఞాపకం పెట్టుకోవాలి.
అటువంటి అనుభవాలు వచ్చినప్పుడు వాటికి చోటిచ్చి విషాదాలుగా మార్చవద్దు, వాటిని భగవంతుని ఆశీర్వాదాలుగా భావిస్తూ ముందుకు కొనసాగాలి.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి