ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మంచి మాటలు

 ఆచార్యుని శ్రీచరణాలయందు ప్రేమ గల వారికి పరమ పదం అర చేత ఉసిరికాయ వంటిది. మన అదృష్టంకొద్దీ మనకు సదాచార్యులు లభిస్తారు. వయస్సు వారికి అంటదు.

 <><><><><><><><><><><><><><>

ఆచార్యులను లభింప చేసిన భగవంతుని పట్ల నీవు సదా కృతజ్ఞుడవై ఉండాలి. ఆచార్యుడు శిష్యుని ఆత్మను రక్షిస్తాడు, శిష్యుడు ఆచార్యుని భౌతిక శరీరాన్ని కాపాడుకోవాలి. 

<><><><><><><><><><><><><><>

 ఆచార్యులు దివ్య దేహధారులు. నీ శరీరంలాంటి పాంచభౌతిక శరీరం కాదు వారిది. అందుకే రజః తమో గుణమయమైన మనస్సు కూడ వారికి ఉండదు. అది శుద్ధ సత్వము.

<><><><><><><><><><><><><><>

"శ్రీమన్నారాయణా!"

నీవు ఆశ్రితుల పాపాలను హరించే దయాళుడవు. అందువల్ల నేను నీకు వందనాలు చేసి యాచించేది ఏమిటంటే, నాకు ఏ  జన్మ లభించినా నీ పై తలంపు గలిగేటట్లుగా అనుగ్రహించు. అలాంటి నీ భావన చేత ఎలాగైనా ఈ సంసార బంధాన్ని తప్పించుకో గలుగుతాను. నీ పై తలంపు లేకపోతే ద్వంద్వ దుఃఖాలు తీరినా, కుంభీ పాకాది నరకాలు తప్పినా, స్వర్గాది భోగాలు కలిగినా, అవి ఆత్మకు శ్రేయోదాయకాలు కావు.

<><><><><><><><><><><><><><> 

శ్రీమన్నారాయణా!

ధర్మార్థ కామాలనే త్రివర్గాల్లో నాకు అపేక్ష లేదు. నాకు కామాలను ఉపభోగించాలనే అపేక్ష లేదు. ధనం సేకరించుకోవాలనే ఆశ లేదు. నాకు పూర్వ కర్మానుపరంగా ఎంత లభిస్తే అంతే చాలు. నిన్ను నేను అనేక విధాల ప్రార్థించి పొందకోరేది ఏమిటంటే ఎన్నెన్ని ఏయే జన్మలు ఎత్తినా నీ పాదారవిందాలపై భక్తి స్థిరంగా నిలిచి ఉండటమే నాకు చాలా ఇష్టమైనది.

<><><><><><><><><><><><><><> 

శ్రీమన్నారాయణా!

నీకు శిరసా నమస్కరించి యాచిస్తున్నాను. నాయందు దయ ఉంచి నా ఈ చిన్న విన్నపమును ఆలకించు. నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ పాదారవిందాలపై నా మనస్సు ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లు నన్ను అనుగ్రహించుము.

<><><><><><><><><><><><><><>

శ్రీమన్నారాయణా!

తమ ఆచార్యుని శ్రీచరణాలయందు ప్రేమ, గౌరవం, భక్తి లేకపోతే తనపట్ల భక్తి కలిగి ఉన్నప్పటికీ శ్రియః పతి కరుణించడు. తాను కరుణిస్తే ఆచార్యుని ద్వారానే అది జరగాలి.

<><><><><><><><><><><><><><>

శ్రీమన్నారాయణా!

ఈ జగత్తుల సృష్టికి ముందు, సచ్చిదానంద స్వరూపుడవై నీవొక్కడవు ద్వైధీభావములేక పరబ్రహ్మముగా నిలిచియుందువట గదా.
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

శ్రీ మహా విష్ణువు – దశావతారాల విశిష్టత

శ్రీ మహావిష్ణువు దశావతారాలు, హిందూ మతంలో విష్ణువు యొక్క పది ముఖ్యమైన అవతారాలు. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో విశ్వాన్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు అవతరించిన రూపం.  విష్ణువు దశావతారాలు: 1. మత్స్య అవతారం: మొదటి అవతారం, మహా విష్ణువు చేప రూపంలో అవతరించి, మనువును జలప్రళయం నుండి రక్షించాడు.  2. కూర్మ అవతారం: రెండవ అవతారం, విష్ణువు తాబేలు రూపంలో అవతరించి, మందర పర్వతాన్ని మోసి, పాల సముద్రాన్ని మధించడానికి సహాయం చేశాడు.  3. వరాహ అవతారం: మూడవ అవతారం, విష్ణువు వరాహ (పంది) రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, భూమిని రక్షించాడు.  4. నరసింహ అవతారం : నాల్గవ అవతారం, విష్ణువు నరసింహ (నరసింహ) రూపంలో అవతరించి, హిరణ్యకశిపుడిని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు.  5. వామన అవతారం: ఐదవ అవతారం, విష్ణువు వామనుడిగా అవతరించి, బలి చక్రవర్తిని ఓడించి, స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని తన మూడు అడుగుల క్రిందకు తీసుకున్నాడు.  6. పరశురామ అవతారం: ఆరవ అవతారం, విష్ణువు పరశురాముడిగా అవతరించి, క్షత్రియులను సంహరించి, భూమిని బ్రాహ్మణులకు దానం చేశ...

వివాహ సమయంలో సప్తపది అంటారు. దీని పూర్వాపరాలు తెలియజేయండి

 "సఖ్యం సాప్తపదీనం" అనేది ఒక శాస్త్ర సూత్రం. అంటే ఏడడుగులు కలిసి ప్రయాణం చేస్తే వారిద్దరికీ స్నేహం కుదురుతుంది - అని భావం. ఈ సూత్రాన్ని తీసుకుని ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క సంకల్పాన్ని జోడించి, వధూవరులిద్దరి చేత సంయుక్తంగా ఏడడుగులు వేయించే వేదోక్త ప్రక్రియే సప్తపది.