ప్రాపంచిక వ్యామోహాలు, సుఖాలు అనే మురికి బట్టలని వదిలి, శాశ్వత సుఖం లేదా మోక్షం కోసం సదా ప్రయత్నం చేయాలి.
ఇచ్చేవాడికంటే పుచ్చుకునే వాడే గొప్ప. మన నుంచి దానం పుచ్చుకొనే వారి వల్లే మనకు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం, తద్వారా ఉత్తమ గతి పొందే అవకాశం మనకు కలుగుతాయి. మనకు ఆ అవకాశాన్ని కల్గించినందుకు దానం పుచ్చుకున్న వారికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి.
మనకు కేటాయించబడిన ఎంత చిన్న పనైనా సరే శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధ చేస్తే అందువల్ల మనకే గాక ఇతరులకి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది.
మనం చేసే దుష్కర్మలు కొన్ని వెంటనే, త్వరగా ఫలితాలను ఇస్తే, మరికొన్ని కొంత సమయం తీసుకున్నాక ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం చేసే అన్ని పనుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
అతి మంచితనం, అతిగా దానం చేయడం, అతి పరాక్రమం, తాను గొప్పవాడను అని భావించే వారి దగ్గరకు లక్ష్మీదేవి చేరదు.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి