ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే.
దైవ ప్రార్థన ఏకాంతంగా చేయాలి. ప్రార్థన అనేది మెదడులోంచి కాక హృదయంలోంచి వస్తేనే అది టూ వే సంభాషణ అవుతుంది. అది దేవుడికీ, మనకు సంబంధించినది తప్ప, మనకు ప్రపంచంలోని ఇతరులకి సంబంధించినది కాదు.
శిక్ష పడుతుందన్న భయంతో కానీ, బహుమతి లభిస్తుందన్న ఆశతో కానీ దేవుడ్ని కొలవడం తప్పు. దేవుడ్ని చేరుకోవడానికి మాత్రమే కొలవాలి.
ఆధ్యాత్మిక వివేచనతో మేలైన వివేకం అలవరచుకుంటే ఆటవికులు కూడా జ్ఞానులైన యోగులవుతారు. స్పష్టమైన జ్ఞాన నియంత్రణలో ఇంద్రియాలు సులువుగా, ఆనందంగా మన అధీనంలోకి వస్తాయి. అప్పుడు మనకు ప్రతిగా కాక మనకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి.
విలువలే మన ప్రవర్తనకు పునాదిరాళ్ళు. మన సంస్కృతికి సమగ్ర భాగస్థులు. మన విలువలు దృఢంగా ఉంటే మనకు తప్పు, ఒప్పులు సులువుగా తెలుస్తాయి. తదనుగుణంగా మనం క్రియాత్మకులం కావచ్చు.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి