నదీ తీరంలో, కొండలపై, పుష్కరాల సమయంలో, దేవాలయాల దగ్గర బ్రహ్మోత్సవాల సమయాల్లో శాస్త్రోక్తంగా వస్త్ర, వస్తు, ధాన్య, ధన రూపేణా ఏదైనా దానం చేయడం చాలా పుణ్యప్రదం. సకల దోషాలు పరిహరింపబడతాయి, గృహంలో ధన, ధాన్య, ఆరోగ్య అభివృద్ధి లభిస్తుంది, సుఖ శాంతులు లభిస్తాయి, వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి, శుభకార్యాలు జరుగుతాయి.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి