మనం జీవితంలో చేసే ఓ పొరపాటు మన గౌరవాన్ని నాశనం చేయవచ్చు. కానీ మనం తప్పు చేశామని గ్రహించ గలిగితే, దాన్ని సవరించి మన వ్యక్తిత్వానికి వన్నె పెట్టుకో గలుగుతాము.
అందుకు ముందుగా మనం మన తప్పుని గ్రహించాలి. తర్వాత దాన్ని అంగీకరించాలి. మనం నేరుగా వారికి ఆ విషయం చెప్పడానికి మన అహం అడ్డు వస్తే, భగవంతుడి ముందు కూర్చుని మనస్ఫూర్తిగా మన తప్పును ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఎవరు బాధితులు అయ్యారో వారికి నష్ట పరిహారం చెల్లించాలి.
అసలు తప్పు చేయని వారిని ప్రపంచం విస్మరిస్తుంది. కానీ తప్పు చేసి దాన్ని అంగీకరించి, చివరికి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడిని ప్రపంచం మర్చిపోదు.
"శుభం భూయాత్"
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి