మనం మన దృష్టిని సదా ఆ దైవం మీద ఉంచితే మనం సూటిగా ఆయన్ని చేరుకుంటాము. అలా కాక దృష్టిని పక్కవాటి వైపు మళ్ళిస్తే దారి తప్పుతాము. కాబట్టి మన గమ్యం సదా ఆ పరమత్మే అయి ఉండాలి.
మనది పోకూడదు అనుకోవడం లోభం. ఇతరులకు చెందింది మనకు రావాలని కోరుకోవడమే స్వార్థం. ఈ రెండూ మనిషికి ఆధ్యాత్మికంగా చెరుపు చేస్తాయి.
మనలో ఎక్కువమంది బహుమతుల వెంటపడి, దేవుడి వైపు వీపుని పెడుతుంటారు. దేవుడి బహుమతులను కాక, దేవుడిని పొందాలన్నది మన ధ్యేయం అయి ఉండాలి.
బాధపడే వాడిని చూసి సహాయం చేయడానికి పరుగెత్తే కాళ్ళు, అతనికి స్వాంతనని ఇవ్వడానికి చాచే చేతులు, అతని బాధని చూసి దయతో కన్నీళ్ళు కార్చే కళ్ళు, అతని బాధని తగ్గించే విధంగా మాట్లాడే నాలుక గలవాడే నిజంగా దేవుడు ప్రేమించే మనిషి. ఎందుకంటే దేవుడ్ని ప్రేమించే వాడే ఆ విధంగా ప్రవర్తించగలడు. అలాంటి వాడంటేనే దేవుడికి ఇష్టం.
భక్తి మార్గంలో తొలి అడుగులు వేయడానికి మా వెబ్సైట్ మీకు ఆదర్శ వేదిక.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి