Skip to main content

Posts

మంత్రజపం విశేష సంఖ్యలో చేస్తున్నప్పుడు, మూత్ర విసర్జన సమస్య వచ్చినపుడు, తప్పనిసరిగా స్నానంచేసి, జపాన్ని కొనసాగించవలసినదేనా?

సమాధానమ్:   మూత్ర విసర్జన చేసినపుడు స్నానాన్ని ఏ శాస్త్రకారుడూ విధించలేదు. శాస్త్రంలో లేని ఆచారాలను సృష్టించుకోవడం సముచితం కాదు. జపదీక్ష ప్రధానమైనపుడు, వయో భారాదులవల్ల మూత్ర విసర్జనాదులు మళ్ళీ మళ్ళీ సంభవిస్తుంటే, మనస్సును మంత్ర దేవత మీద నుంచీ మళ్ళనీయకుండా జాగ్రత్త పడుతూ, పాద ప్రక్షాళన ఆచమనాలను ఆచరించి, వెంటనే జపంలోకి ప్రవేశించటమే శాస్త్ర సమ్మతం.
Recent posts

వాసుదేవుడు ద్వాపర యుగం వాడైతే, కృతయుగంలోనే ధృవుడు వాసుదేవ మంత్రాన్ని ఎలా జపించాడు? వివరించండి.

సమాధానం:     వాసుదేవ అనే శబ్ధానికి రెండర్థాలున్నాయి.   వసుదేవ పుత్రుడు,   వస్-అంతటా ఉండువాడు, దివి-ప్రకాశించువాడు, తేజోరాశి-వాసుదేవుడు. మొదటి అర్థం శ్రీకృష్ణుడు అవతరించిన తర్వాత వచ్చింది. రెండవ అర్థం ఎప్పటి నుండో ఉంది. వేదమే ఆ నామాన్ని గాయత్రిలో చేర్చుకుంది. ఆ నామాన్నే నారదుడు ధృవుడికి ఉపదేశించాడు. ఆ పేరు కృష్ణునికి వచ్చింది. అసలు శ్రీకృష్ణనామం కూడ కృష్ణుడు అవతరించక మునుపే వేదంలో వరాహావతారాన్ని తెలుపుతూ ఉంది. భూదేవి ప్రార్థనలో ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శత బాహునా ఓ భూమీ! నీవు అనేక చేతులు గల కృష్ణుడగు వరాహస్వామిచే ఎత్తబడితివి. ఇక్కడ కృష్ణుడంటే పూర్ణ ఆనంద ప్రదుడు అని అర్థం. ఒక ధర్మ సూక్ష్మాన్ని నలుగురూ తెలిసికొనేలా చేసింది మీ పరి ప్రశ్న. సంతోషం.

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న

గోవింద అనే పేరు కలియుగంలో కదా వచ్చింది. అయితే ద్వాపరయుగంలో ద్రౌపది గోవిందా అని ఎలా అనగలిగింది?

సమాధానం:  గోవింద అనే నామం శ్రీకృష్ణుడికి మొదట వరాహావతారంలో భూదేవిని ఉద్ధరించినపుడు తర్వాత ద్వాపర యుగంలోను వచ్చింది. తనకు హోమ హవిస్సులు ఇవ్వలేదనే కోపంతో, ఇంద్రుడు గోకులంలో రాళ్ళవాన కురిపించి అందరినీ భయభ్రాంతుల్ని చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతం చిటికెన వ్రేలితో గొడుగుగా ఎత్తి, ఆ బాలగోపాలానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఏడు రోజుల తర్వాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని, కామధేనువుతో కృష్ణుడి వద్దకు వచ్చి, క్షీరాభిషేకం చేస్తాడు. గోవులను, గోపాలురను పొంది ఆనందింపజేసినవాడుగా శ్రీకృష్ణుడికి గోవింద పట్టాభిషేకం జరుగుతుంది. అప్పటి నుండి ఆయన గోవిందుడయ్యాడు. ఆ తర్వాత ద్రౌపది ఆయన్ను గోవిందా అని పిలిచి శ్రీకృష్ణుని నుండి రక్షణ పొందుతుంది. ఆ గోవిందనామంతోనే కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని భక్త కోటి ప్రేమతో, ప్రపత్తితో భజిస్తున్నారు. ఎలుగెత్తి గోవిందా, గోవిందా అంటున్నారు. గోవిందా గోవింద

స్ఫటికమాల, తులసి మాల ధరించడం వల్ల ప్రయోజనం ఏమిటి? సుమంగుళులు ఇవి ధరించవచ్చా?

సమాధానం:   ఈ మాలలు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేస్తాయి. తులసిమాలలు రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తాయి. మనస్సుకు శాంతిని, ఏకాగ్రతను ప్రసాదిస్తాయి. విష్ణువుకు ప్రీతికరం అయిన తులసి ధరిస్తే మనకు ఆ స్వామి మీద ప్రీతి అధికమవుతుంది. స్ఫటికం కూడా గుండెను, దేహాన్ని ప్రసన్నంగా ఉంచేదే.   అయితే ఈ మాలలు ఎప్పుడూ అపవిత్రం కాకుండా చూసుకోవాలి. వయసులో పెద్ద వారైన, ముని పత్నుల వంటి వారు ఈ మాలలు ధరించవచ్చు. సుమంగుళులకు మంగళ సూత్రమే ప్రధానం.

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

నాకు ఈ జన్మలోనే ఆత్మదర్శనం, దైవదర్శనం, మోక్షం సంపాదించాలని ఉంది. నేనేం చేయాలి?

సమాధానం:   ప్రతి ఒక్కరూ కోరుకోదగినది, చేరుకోవలసినది ఇదే. ముందు సత్పురుష సాంగత్యం చేయండి. ఒక సత్సంగంలో చేరండి. శమదమాది గుణాలు అలవరచుకోండి. ఒక సద్గురువును ప్రసాదించమని మీ కులదైవాన్ని ప్రార్థించండి. సద్గురువులంటే కేవలం దర్శనం మాత్రం ఇచ్చే దర్శన గురువులు కాదు. ఆర్భాటం ప్రదర్శించి డబ్బులు గుంజుకునే ప్రదర్శన గురువులు కాదు. ఏం చెయ్యాలో చెప్పకుండా మాయమాటలు చెప్పే మాయాగురువులు కాదు. ముందు తాము ఆచరించి, తర్వాత శిష్యులకు చెప్పి, చేయించే సదాచార్యులనే ఆశ్రయించండి. వారు తత్త్వదర్శనులు, మార్గదర్శకులు అయి ఉంటారు. ఒకసారి దైవానుగ్రహంతో సదాచార్యులు లభించాక, ఇక మీ భారమంతా ఆయనపై ఉంచి, నడుచుకోవడమే మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాలను చేరుకునే ఏకైక మార్గం.