Skip to main content

గ్రహణాల గురించి మన జ్యోతిష పండితులు చెప్పేదొకటయితే, ఆధునిక శాస్త్రవేత్తలు మరొక విధంగా చెప్తున్నారు. ఎవరు చెప్పేది నమ్మాలి?

సమాధానం: ఇద్దరు చెప్పేవీ నమ్మదగినవే.

సూర్య చంద్ర గ్రహణాల గురించి వారిద్దరూ చెప్పే విషయంలో వైరుధ్యం ఏమీలేదు. వేదంలో ఉన్న విజ్ఞానాన్ని బీజరూపంలో ఉన్న కథలనే పురాణాల్లో విశదంగా కథల రూపంలో వివరిస్తారు.

రాహువనే రాక్షసుడు సూర్యుణ్ణి ఆక్రమించి అంధకారంతో కప్పివేస్తే, అత్రి మహర్షి తన మంత్ర, యంత్ర, తంత్ర శక్తులతో సూర్యుణ్ణి మరలా ప్రకాశించేలా చేశాడని ఋగ్వేదంలో ఉంది. ఇదే భాగవత పురాణంలో విశదీకరింపబడినది.

క్షీరసాగర మధనంలో వచ్చిన అమృతాన్ని మోహిని రూపంలో విష్ణువు దేవతలకు పంచుతుంటాడు. రాహువు కామ రూపుడై దేవతల పంక్తిలో కూర్చుంటాడు.  ఇది గమనించిన సూర్య చంద్రులు విష్ణువుకు ఉప్పందిస్తే, ఆయన తన సుదర్శన చక్రంతో రాహువు తల ఖండిస్తాడు,  తల రాహు గ్రహంగా, మొండెం కేతు గ్రహంగా హరి కరుణతో ఆకాశంలో నిలుస్తారు.

వారికి సూర్య చంద్రులపై ఉన్న ఈ కోపం కారణంగా, అమావాస్య, పౌర్ణమిలలో వారిని గ్రహణాలుగా పట్టుకుంటారని పురాణ కథనం.

మన జ్యోతిషశాస్త్రంలో గ్రహణాన్ని ఉపరాగం అంటారు. భూమి నీడ చంద్రుని కప్పివేసినపుడు చంద్ర గ్రహణము, చంద్రుడు సూర్యుని కప్పి వేసినప్పుడు సూర్య గ్రహణము అని సిద్ధాంత శిరోమణి గ్రంధంలో శ్రీభాస్కరాచార్యులు చెప్పారు.

ఏ పున్నమి నాడు సూర్య చంద్రుల అంశలు భూమికి సమానం అవుతాయో ఆనాడే చంద్ర గ్రహణం.

ఏ అమావాస్య నాడు సూర్య చంద్రుల అంశలు సమానం అవుతాయో ఆనాడే సూర్య గ్రహణం.

సూర్య చంద్రులిద్దరూ తమ పరిధులలో ఉన్నా, అమావాస్య నాడు ఏకరాశిలో చేరుతారు.

అందుకే అమావాస్యను సూర్యేందు సంగమం అంటారు.

శుభంభూయాత్

Comments

Popular posts from this blog

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

విద్యా వివాదాయ ధనం మదాయ - Stotras and Slokas - 2

విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరిపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ దుర్మార్గుడు విద్యను వివాదం కొరకు ఉపయోగిస్తాడు. అతని ధనం మదానికి కారణం అవుతుంది. అతని శక్తి ఇతరులను పీడించడానికి ఉపయోగపడుతుంది. సత్పురుషునికి మాత్రం విద్య వల్ల జ్ఞానం కలుగుతుంది, ధనం వల్ల దాతృత్వం అబ్బుతుంది. అతని శక్తి సమాజాన్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది.

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న