మనం జీవితంలో చేసే ఓ పొరపాటు మన గౌరవాన్ని నాశనం చేయవచ్చు. కానీ మనం తప్పు చేశామని గ్రహించ గలిగితే, దాన్ని సవరించి మన వ్యక్తిత్వానికి వన్నె పెట్టుకో గలుగుతాము. అందుకు ముందుగా మనం మన తప్పుని గ్రహించాలి. తర్వాత దాన్ని అంగీకరించాలి. మనం నేరుగా వారికి ఆ విషయం చెప్పడానికి మన అహం అడ్డు వస్తే, భగవంతుడి ముందు కూర్చుని మనస్ఫూర్తిగా మన తప్పును ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఎవరు బాధితులు అయ్యారో వారికి నష్ట పరిహారం చెల్లించాలి. అసలు తప్పు చేయని వారిని ప్రపంచం విస్మరిస్తుంది. కానీ తప్పు చేసి దాన్ని అంగీకరించి, చివరికి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడిని ప్రపంచం మర్చిపోదు. "శుభం భూయాత్"
భక్తి మార్గంలో తొలి అడుగులు వేయడానికి మా వెబ్సైట్ మీకు ఆదర్శ వేదిక.