నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నవగ్రహాలలో భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి అది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనం ఈ భూమ్మీద ఉన్నాం కాబట్టి నవ గ్రహాలలో ఈ భూమిని చేర్చకుండా సూర్యుని వాటిలో చేర్చారు మన పంచాంగకర్తలు. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీనినే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రునికి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, గురు గ్రహ శక్తిహీనతను గురు మౌడ్యమి గానూ, శుక్ర గ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే వ్యవహారిక భాషలో మూఢమి అని అంటారు. మౌడ్యమి ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదు.